CM YS Jagan : ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మంగళగిరి సభలో జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలో బీసీల పొట్ట కొట్టారని ఆరోపించారు.30 లక్షలకు పైచిలుకు భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టడం జరిగింది.2019 ఎన్నికల ప్రచారం సమయంలో ఏలూరులో వైసీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించి అధికారంలోకి వచ్చాక బీసీలను నట్టేట ముంచారని విమర్శించారు.బీసీలు సంక్షేమానికి ఎన్నో హామీలు ప్రకటించే అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చలేదని పవన్ కళ్యాణ్ వైసీపీపై మండి పడటం జరిగింది.
అయితే తాజాగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ మాట్లాడారు. మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశామన్నారు. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. అమ్మఒడి పథకంతో 53 లక్షల మంది తల్లులకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు సీఎం జగన్. పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదని చెప్పారు. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదని అన్నారు.
గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి పనులు జరిగాయా..? అని.. ఎక్కడ లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగారు. బాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని.. పొదుపు సంఘాలకు చేసిన దగా కనిపిస్తుందన్నారు. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని ఎద్దేవా చేశారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారరు. వీరిద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారని.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ మోసం చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును నమ్మడం అంటే.. కాటేసే పామును నమ్మడమేనని.. బాబు-పవన్ను నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమేనన్నారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చేస్తాడని ధ్వజమెత్తారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…