CM Yogi : తెలంగాణలో ఎన్నికలు మరో మూడు రోజులలో జరగనుండగా, ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. బీజేపీ కూడా అధికారం కోసం పాకులాడుతుంది. ఈ క్రమంలో యోగి ఆధిత్యనాథ్ కూడా ప్రచారం చ,ఏశాడు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరాముడి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తామనిఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహబూబ్ నగర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో సరిహద్దు ప్రశాంతంగా ఉందన్నారు. దేశంలో ఎలాంటి అలజడులు లేవన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కాంగ్రెస్ వల్ల అయ్యేదా? అని ప్రశ్నించారు. నడుస్తోంది నరేంద్రమోదీ ప్రభుత్వం అని, అవినీతిపరులను వదిలే ప్రభుత్వం కాదన్నారు.
తాను సీఎంగా ఉన్నానని కానీ ఏనాడూ అధికార దర్పాన్ని ప్రదర్శించ లేదన్నారు యోగి ఆదిత్యానాథ్ . పదవులు శాశ్వతం కాదన్నారు. కానీ మనం చేసిన పనే మనల్ని గెలిపించేలా చేస్తాయని స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ తాను దైవాంస సంభూతుడినని తనకు తానుగా భావిస్తున్నారని ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. గడీల పాలనలో లెక్కకు మించిన గాయాలు ఉన్నాయని వీటిని పూర్తిగా మానేలా చేయాలంటే కేవలం బీజేపీ నుంచి మాత్రమే సాధ్యమవుతుందన్నారు యోగి ఆదిత్యానాథ్. ప్రజలు పాలన సాగించమని గెలిపిస్తే సచివాలయానికి రాకుండా, ప్రజా దర్బార్ నిర్వహించకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతే ఎలా అని కేసీఆర్ ను ప్రశ్నించారు.
జనం మార్పు కోరుకుంటున్నారని వారంతా బీజేపీ రావాలని కంకణ బద్దులై ఉన్నారని స్పష్టం చేశారు యూపీ సీఎం. అయితే ఈ మీటింగ్లో యోగి తెలుగులో మాట్లాడడం ప్రాధన్యత సంతరించుకుంది. నమస్కారం తెలంగాణ. సోదరీ సోదరీమణుల్లారా అందరికి నమస్కారం అంటూ యోగి తెలుగులో మాట్లాడేసరికి జనాలు తెగ గోల చేశారు. చప్పట్లో ప్రశంసించారు. ప్రస్తుతం యోగికి సంబంధించిన వీడియో విడుదల కానుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…