CM Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపచడంతో పాటు ప్రశంసల జల్లు కురిసేలా చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ప్రజలలో మద్యం అలవాటును తగ్గించడానికి బెల్ట్ షాపులని మూసివేసే ఆలోచనని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తక్షణమే అన్ని గ్రామాలలో, బస్తీల్లో బెల్ట్ షాపులు మూయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.మ ద్యం కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా బెల్ట్ షాపు కారణంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వీటిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే ఉంటాయి.
తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవలే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా బెల్డ్ షాపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. బెల్ట్ షాపుల కారణంగా యువత, చిన్నారులు మద్యానికి బానిస అవుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష బెల్ట్ షాపులను నిషేధించాలని ప్లాన్ చేస్తోంది. ముందు బెల్ట్ షాపుల లెక్క తేల్చి, వాటి వల్ల దుష్ప్రరిణామాలు లేకుండా చేసేందుకు గ్రామాల్లోని ఈ లిక్కర్ దందాను బంద్ చేపించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసివేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు.
ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉంటాయి. పలుచోట్ల ఈ బెల్ట్ షాపుల్లో నిరంతరం మద్యం విక్రయాలు జరుగుతాయి. వీటి కారణంగా యువతతో పాటు విద్యార్థులు చెడు మద్యానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వాటిపై ఉక్కుపాదం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో కు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలని సూచించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…