CM Revanth Reddy : రోజా పెట్టిన పులుసు తిని అలా చేశారు.. రేవంత్ రెడ్డి కామెంట్స్..

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా సాగుతుంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నాయ‌కులపై అనేక విమ‌ర్శ‌లు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి వివాదాలపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి రాసిచ్చేశామంటూ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నారని.. అసలు కృష్ణాజలాలను ఏపీకి రాసిచ్చింది కేసీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేవంత్‌రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. పలు అంశాల్లో ఆ పార్టీ నేతలను చెడుగుడు ఆడేసుకున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంలో బీఆర్ఎస్‌ను అసెంబ్లీలో షేక్‌ చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.

రాష్ట్ర పునర్విభజన బిల్లు నా సూచన మేరకే వచ్చిందని కేసీఆర్ పదే పదే చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? నరేంద్ర మోదీ నల్లగొండలో ఉంటారా? ఢిల్లీలో ఉంటారా? కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. దమ్ముంటే ఢిల్లీలో చూస్కోండి. గల్లీలో కాదు. జంతర్ మంతర్ లో ధర్నా చేయండి. మేము కాపాలా ఉంటాం. నాగార్జునసాగర్ మీదకి జగన్ తుపాకులతో వస్తే.. చేత కాక కూర్చున్నారు. రాయలసీమకు పోయినప్పుడు మంత్రి రోజా ఇంటికి వెళ్లి ఆమె పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు కేసీఆర్. రాయలసీమ ఎత్తిపోతల పథకం.. జీవో 203 రూపొందించుకుంది ప్రగతి భవన్ లోనే. ఏపీ.. ఒక్కరోజు 12.5 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తరలించుకుపోయేలా ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళు మూసుకున్నారు.

CM Revanth Reddy comments on kcr and roja
CM Revanth Reddy

తెలంగాణకు ఎస్ ఎల్ బీసీని.. తొమ్మిదిన్నరేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. పాలమూరు-రంగారెడ్డి పదేళ్లలో పూర్తి చేయలేదు. పదేళ్లలో కృష్ణా నీళ్లలో మరణశాసనం రాశారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతుంటే మా కాళ్ళకు అడ్డం పడుతున్నారు. కృష్ణా జలాల నీళ్లు అప్పగించింది కేసీఆర్ కాదా? 68శాతం క్యాచ్ మెంట్ ఏరియా ఉంటే.. 33శాతం నీటి వాటా 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. సంతకాలు చేయడం వల్ల.. కృష్ణాలో తెలంగాణకు మరణశాసనం రాశారు. 2014లో కొత్తలో చేశారేమో అనుకున్నాం. కానీ 2016తో పాటు 2023 వరకు సేమ్ సంతకాలు చేశారు. దీనికి హరీశ్ రావు ఏం సమాధానం చెబుతారు? జగన్ ఆక్రమించుకుంటే ఏం చేశారు?” అని నిలదీశారు రేవంత్ రెడ్డి.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

21 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago