CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ.. ఎవ‌రెవ‌రిని క‌లిసారంటే..!

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆయ‌న బిజీబిజీగా గ‌డుపుతున్నారు.తొలిరోజు ఆయన ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపుల గురించి వారికి గుర్తు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించాల‌ని కోరారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించార‌ని గుర్తు చేసిన ఆయన.. అద‌నంగా 29 అద‌న‌పు ఐపీఎస్ పోస్టులు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారంటున్నారు. 2024లో కొత్త‌గా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికారుల‌ను అద‌నంగా కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారని తెలుస్తోంది.

హైదరాబాద్‌లో మెట్రో రెండో దశకి సంబంధించి సవరించిన ప్రతిపాదనలను ఆమోదించాలని సీఎం రేవంత్, హోంమంత్రి అమిత్ షాని కోరారు. హైదరాబాద్ మెట్రో రెండో దశను బీహెచ్ఈఎల్‌, లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీనగర్ కి సంబంధించి 26 కిలోమీటర్లు అలాగే ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ – రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ 32 కిలోమీటర్లు ఉండబోతున్నాయి. వీటికి మొత్తం రూ.15వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా. ఇక రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం 9వ షెడ్యూల్‌ లో పేర్కొన్న సంస్థ‌ల విభ‌జ‌న‌ను పూర్తి చేయాల‌ని, 10వ షెడ్యూల్ ప‌రిధిలోని సంస్థ‌ల వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని, ఢిల్లీలోని ఉమ్మ‌డి రాష్ట్ర భ‌వ‌న్ విభ‌జ‌న‌ను సాఫీగా పూర్తి చేయాల‌ని కూడా అమిత్ షా ని కోరారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy busy in delhi tour
CM Revanth Reddy

చ‌ట్టంలో ఎక్క‌డా పేర్కొన‌కుండా ఉన్న సంస్థ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్లెయిమ్ చేసుకుందనే విషయాన్ని ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ‌లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బ‌లోపేతానికి రూ.88 కోట్లు, సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో కోసం రూ.90 కోట్లు అద‌నంగా కేటాయించాల‌ని విజ్ఞప్తి చేశారు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా క‌ల్పించాల‌ని జ‌ల్ శ‌క్తి మంత్రి గజేంద్ర‌సింగ్ షెకావ‌త్‌ ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీలో మంత్రి ఉత్త‌మ్ కుమార్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు అనుమ‌తులు వచ్చాయని, హైడ్రాల‌జీ, ఇరిగేష‌న్ ప్లానింగ్‌, అంచ‌నా వ్యయం వంటివి కేంద్ర జ‌ల సంఘం ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని, వాటికి వెంట‌నే ఆమోదం తెల‌పాల‌ని కోరారు. తమ అభ్యర్థనలకు మంత్రి సానుకూలంగా స్పందించారని మీడియాకు తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

19 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago