CM KCR : తెలంగాణ ఎన్నికలు నేపథ్యంలో జోరుగా అనేక ప్రచారాలు సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రంగా దూషించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలోను అనేక ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో కొన్నింటికి కేసీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను పరిపాలిస్తున్నారంటే అందుకు కారణం సోనియాగాంధీయేనని, ఆమె దయవల్ల, రాజ్యాంగం దయవల్ల, పార్లమెంటరీ సిస్టం వల్ల రాష్ట్రం వచ్చిందని గుర్తుంచుకోవాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు అక్రమాలు చేసి సంపాదిస్తున్న డబ్బు అంతా కేసీఆర్ ఇంటికి చేరుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతల వద్ద కూడా ఈ అక్రమార్జన ఉందన్నారు.
తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ఇక్కడి యువత కలలను, ఆశయాలను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన వల్ల తెలంగాణ ఎంతో నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కనిపించడంలేదని ఆరోపించారు. తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్స్ మాఫియా పెరిగిందని, ఆ డబ్బంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికే చేరిందని కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ .. సోనియా గాంధీని దేవత అన్నాడని, ఆమె కాళ్లు మొక్కాడని ప్రచారం జరుగుతుంది. అయితే తాను ఏనాడు సోనియాని దేవత అనలేదని, వేరే కాంటెస్ట్లో అన్నదానిని అలా ప్రచారం చేశారంటూ కేసీఆర్ చెప్పుకొచ్చాడు.
విలేకరులు మాట్లాడుతూ ఆమె మీకు తెలంగాణ ఇస్తుందని అంటుంద అని అన్నారు. అయితే ఎవరు తెలంగాణ ఇస్తే వారు మాకు దేవుళ్లు అన్నట్టు చెప్పాను. ఈ కాంటెస్ట్లో చెబితే నేను దేవత అన్నట్టు ప్రచురించారు అని కేసీఆర్ అన్నారు. ఎవ్వరైన తెలంగాణ ఇస్తామని చెప్పి మాట తప్పితే రోడ్డుకి ఈడ్చుతాం అని అంటే, దానిని వేరేలా ప్రచురించారు అని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇక తెలంగాణ ఇచ్చినందుకు కేసీఆర్ సోనియా గాంధీ పాదాలకు నమస్కరించినట్టు ఓక ఫోటో వైరల్ అయింది. అయితే కేసీఆర్ వంగి మరొకరి పాదాలకు నమస్కరిస్తున్న అసలైన ఫోటో అది. 2015 జూన్ నెలలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు, కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీ పాదాలను తాకి స్వాగతం పలికిన దృశ్యాన్ని ఎడిట్ చేసి సోనియా కాలు మొక్కినట్టు వైరల్ చేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…