CM KCR : ఈ సారి కేసీఆర్‌కి పెద్ద షాకే ఇవ్వ‌బోతున్నారుగా.. పోటీలో 120 మంది..!

CM KCR : మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నున్న తెలంగాణ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఒక‌వైపు అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి ఎన్నికల బరిలో నేరుగా సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావును ఢీకొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం.. ఈ మేరకు వారిపై బలమైన అభ్యర్థులను నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌.. గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని సీఎం బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది.

అయితే కేసీఆర్ కి పోటీగా 120 మంది నిలుచోబోతున్న‌ట్టు స‌మాచారం. కామారెడ్డిలో కేసీఆర్‌కి చెక్ పెట్టాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. కామారెడ్డి అసెంబ్లీ బరిలో రైతులు నిలపడనున్నారు. లింగాపూర్‌లో ఎనిమిది గ్రామాల మాస్టర్‌ ప్లాన్‌ బాధితులు సమావేశం అయి.. 120మంది నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉద్యమం ఉధృతం చేస్తామని బాధితుల హెచ్చరిస్తున్నారు. ఇక రైతుల నామినేషన్లతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ అంద‌రిలో నెలకొంది.. తమ భూములను కాపాడుకోవడమే తమ లక్ష్యమని చెబుతున్న రైతులు మాస్ట‌ర్ ప్లాన్ ర‌ద్దు చేశాకనే కామారెడ్డిలో అడుగుపెట్టాల‌ని సూచిస్తున్నారు. కామారెడ్డిలోని వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు పారిశ్రామిక జోన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు.

CM KCR contesting constituency 120 farmers
CM KCR

వందలాది ఎకరాలను బదలాయించే మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోక‌పోతే తీవ్ర‌ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోవైపు నిజామాబాద్‌ పసుపు రైతులు క‌విత‌కి షాక్ ఇచ్చారు. పసుపు బోర్డు తీసుకురావడంతో కవిత విఫలమయ్యారంటూ ఆమెకు వ్యతిరేకంగా 180 మంది రైతులు నామినేషన్‌ వేయడం అప్పట్లో సంచలనం రేపిన విష‌యం తెలిసిందే.. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపూరి అరవింద్‌ చేతిలో కవిత ఓటమి పాలు కాగా, రైతులు వ్యతిరేకించడంతోనే కవిత ఓడిపోయారని అప్ప‌ట్లో తీవ్ర‌మైన చ‌ర్చ న‌డిచింది. మ‌రోవైపు తెలంగాణ‌లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లకు గట్టి పోటీనిచ్చేందుకు సీనియర్లను రంగంలోకి దింపుతున్నట్లు ఏఐసీసీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

12 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago