Chiranjeevi : కొద్ది రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ తన ఫాం హౌజ్లో కాలు జారి పడడంతో ఆయన తుంటికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కేసీఆర్ని రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ నుంచి పరామర్శల వెళ్లువ కొనసాగుతూనే ఉన్నది. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కేసీఆర్ చాలా హెల్తీగా ఉన్నారని త్వరలోనే దైనందిన జీవితంలోకి వస్తారంటూ తెలిపారు. సర్జరీ చేసిన 24 గంటల్లోనే నడిపించిన డాక్టర్ల కృషి అభినందనీమయమన్నారు. కేసీఆర్ సినీ ఇండస్ట్రీ గురించి కూడా అడిగారని అంతా బావుందని చెప్పానన్నారు. డాక్టర్లు 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు. సర్జరీ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన నడిచేలా వైద్యులు చూసుకున్నారన్నారు. కేసీఆర్ సాధ్యమైనంత త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్.. తనను సినిమా పరిశ్రమ గురించి అడిగినట్లు చెప్పారు. సినిమాలు ఎలా ఆడుతున్నాయి? ఇండస్ట్రీ ఎలా ఉంది? అని కేసీఆర్ అడిగినట్లు చెప్పారు. ఇక ఆసుపత్రిలోనే ఉన్న కేటీఆర్ భుజాలపై మెగాస్టార్ చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు. ఎదురుగా కనిపించిన కవితకు నమస్కరించారు. కేటీఆర్ ఆయనను లోపలి తీసుకువెళ్లారు.
రెండు రోజుల క్రితం ఫామ్హౌస్లో కిందపడడంతో గాయపడ్డ కేసీఆర్ను వెంటనే సోమాజిగూడ యశోదా దవాఖానకు తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు తుంటి ఎముక ఫ్యాక్చర్ అయిందని తెలిపి అదే రోజు రిప్లేస్మెంట్ సర్జరీ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.విషయం తెలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆదివారం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ను పరామర్శించారు.ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు నాయకులు కేసీఆర్ను పరామర్శించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…