Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నారు. గత ఏడాది వాల్తేరువీరయ్య, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండింటిలో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక భోళాశంకర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గుడ్ న్యూస్ విన్నారు. ఈ 2024లో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు ఆయన అభిమానులు తెగ సంబరపడిపోయారు.
తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంభరకాగా, ఈ మూవీ మెగా ఫాంటసీ అడ్వెంచర్ జానరల్లో వస్తుంది. ఈ చిత్రానికి బింబిసార వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని రూపొందించిన వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా గత సంవత్సరం అధికారికంగా షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఇటీవలే సంక్రాంతి పర్వదినం నాడు విశ్వంబర అనే టైటిల్ను ఖరారు చేస్తూ గ్లింప్స్ అండ్ కాన్సెప్ట్ వీడియో అధికారికంగా విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన పోస్టర్తోపాటు ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అంతేకాకుండా ఆ గ్లింప్స్ మూవీపై క్యూరియాసిటీ కలిగేలా చేసింది.
చిరంజీవి ఇంకా విశ్వంభర సెట్స్లో అడుగుపెట్టలేదు. అయితే తాజాగా ఆయన సెట్స్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఓ వీడియో ద్వారా చెప్పారు. విశ్వంభర మూవీ కోసం సరికొత్తగా రెడీ అవుతున్నారు. అందుకు గానూ ఎప్పుడు చేయని విధంగా భారీ కసరత్తులు చేస్తున్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియో చివరిలో విశ్వంభర కోసం రెడీ అవుతున్నాను అని తెలిపారు. ఆ వీడియోలో భారీ కసరత్తులు చేస్తూ చెమటలు చిందించారు మెగాస్టార్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి 68 ఏళ్లు. 68 ఏళ్ల వయసులోనూ సినిమా కోసం పద్మవిభూషణ్ చిరంజీవి పడే కష్టం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…