Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గతేడాది భోళా శంకర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో మంచి సక్సెస్ ట్రాక్ ఎక్కిన చిరంజీవి భోళా శంకర్ మూవీతో మళ్లీ పరాజయం చూశారు. ఇక ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గుడ్ న్యూస్ విన్నారు. ఈ 2024లో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు ఆయన అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కూడా. ఆయన ఊ అంటే.. అది ఏదైనా నిమిషాల్లో జరిగిపోతుంది. అది చిరు స్థాయి.
చిరు మాత్రం చిన్నాచితకా నటీనటులను రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘నాకు మీతో కలిసి నటించాలని వుంది. మనం ఎప్పుడు కలిసి పని చేద్దాం’ అని అడుగుతూ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నారు. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రావు రమేష్ తో చిరు ఇలాగే మాట్లాడారు. ‘నాతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. మనం ఎప్పుడు కలిసి సినిమా చేద్దాం’ అంటూ చిరు.. రావు రమేష్ ను అడగడం అందర్నీ షాక్ కి గురి చేసింది. రావు రమేష్ ప్రతిభావంతుడైన నటుడే, కానీ ఆయన హీరో కాదు. ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాంటి నటుడిని కూడా చిరు అడిగాడంటే… ఆశ్చర్యం వేస్తుంది. హేమా హేమీల్ని, స్టార్ హీరోలను అడిగినట్టు చిరు ఇలా సహాయ నటులను కూడా అడిగి, తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడు. అసలు రావు రమేశ్ కోసం కూడా చిరంజీవి ఇంతలా దిగజారిపోవాలా ? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయినా చిరు ఇలా రిక్వెస్ట్ చేయడం కొత్త కాదు. గతంలో అనేక వేదికల పై హీరోయిన్లను కూడా చిరు ఇలాగే రిక్వెస్ట్ చేశాడు. ఆ మధ్య సాయి పల్లవితో ‘నాకు నీతో కలిసి స్టెప్పులు వేయాలని ఉంది’ అంటూ ముచ్చట పడ్డాడు. అంతకు ముందు తమన్నాతో కూడా ఇదే ముక్క చెప్పాడు. మధ్యలో రాశి ఖన్నా విషయంలో చిరు ఇలాగే బిహేవ్ చేశాడు. ఇక రష్మికతో అయితే.. నీకు నేను రెగ్యులర్ గెస్ట్ ను అంటూ కామెంట్లు చేశాడు. ఇప్పుడు రావు రమేష్ వంతు వచ్చింది.ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు కావొచ్చు.. కానీ గొప్పోడు చిన్నోళ్ల దగ్గర తగ్గితే చీప్ గా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాడు ఇలా తగ్గి మాట్లాడితే అవతలి వారు ఎంత ఆనందం పొందుతారో చిరుకి చాలా తెలుసు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…