Chinna Jeeyar Swamy : పాన్ ఇండియా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న విడుదల కానుండగా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జూన్ 6న… తిరుపతి వేదికగా అట్టహాసంగా జరిగింది. సినిమా టీమ్ మొత్తం ఈ కార్యక్రమానికి తరలివచ్చింది. అంతేకాదు అభిమాన నాయకుడిని కళ్లారా చూద్దామని వేలకొలది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. గోవింద నామస్మరణ జరిగే చోట.. జై శ్రీరామ్, జై సియారామ్ నినాదాలూ హోరెత్తాయి. వేడుకకి త్రిదండి చినజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అతిథులుగా హాజరయ్యారు.
ప్రభాస్ ఎంట్రీ సమయంలో.. బాణాసంచి పేలుళ్లతో గ్రౌండ్ అంతా సందడిగా మారింది. సినిమాకు ప్రాణంలా అనిపించే.. జై శ్రీరామ్ పాటను లైవ్లో ఆలపించింది అజయ్ అతుల్ అండ్ టీమ్. వారితో పాటు అశేష జనవాహిని సైతం.. గొంతు కలపడం విశేషం.అయితే చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ కి తన ఆశీస్సులు అందించారు. ఈ తరానికి రామాయణ కథని అందించే ప్రయత్నం చేస్తున్న ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ ని ప్రశంసించారు. శ్రీరాముడిని కీర్తిస్తూ శ్లోకంతో చినజీయర్ స్వామి తన ప్రసంగం ప్రారంభించారు. శ్రీరాముడు ఈ నేలపై నడయాడిన మహోన్నత రూపం అని ఆయన అన్నారు. బాహుబలి అయిన ప్రభాస్.. నిజమైన బాహుబలి శ్రీరాముడు అని లోకానికి నిరూపించడానికి వస్తున్నాడు.
శ్రీరాముడు మానవజాతికి ఆదర్శ పురుషుడు. రాముడిని మనుషులు ప్రేమించారు. పశువులు, పక్షులు కూడా ప్రేమించాయి. ఋషులు, రాక్షసులు కూడా ఎంతో ప్రేమించారు. ముక్కు చెవులు కోసిన శూర్పణఖ కూడా ప్రేమించింది. రాముడు అడవులకు వెళ్ళినప్పుడు ఆయన్ని అడవుల్లో వదిలిన రథం గుర్రాలు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బలవంతంగా తీసుకెళ్లారు. అలాంటి రాముడి చరిత్రని ఈ తరానికి అందించబోతున్న ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ లకు అభినందనలు అని చినజీయర్ స్వామి అన్నారు. ప్రతి ఒక్క మనిషిలో రాముడు ఉంటాడు. ప్రభాస్ తనలోని రాముడిని పైకి తెస్తున్నారు. ఈ చిత్రాన్ని మీరంతా ఆదరిస్తే లోకం మొత్తం వ్యాపిస్తుంది అని చినజీయర్ స్వామి అన్నారు. చిత్ర బృందం మొత్తానికి నా దీవెనలతో పాటు, ప్రేక్షకులైన మీ దీవెనలు కూడా కావాలని అన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…