Chandra Babu : జ‌గ‌న్‌కి చంద్ర‌బాబు వార్నింగ్.. మీ రౌడీయిజానికి ఇక కాలం చెల్లిన‌ట్టే..!

Chandra Babu : ప్ర‌స్తుతం ఏపీ రాజకీయాలు ప్ర‌కంప‌నలు పుట్టిస్తున్నాయి. ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటూ రాజ‌కీయాల‌లో వేడిపెంచుతున్నారు. తాజాగా చంద్ర‌బాబు ప్రెస్‌మీట్‌లో జ‌గ‌న్‌తో పాటు ఏపీ రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిందన్నారు. ఎక్స్‌పైరీ డేట్‌ అయ్యాక ఏ మందు వాడాలో కూడా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.

వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నా.. మీరు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.. మీరు తిడతారని నాకు తెలుసు.. మీరు ఓడిపోతారని మీకు కూడా తెలుసు. మీకు ఎక్స్ పైరీ డేటు దగ్గర పడింది. అందుకేనేమో.. ఎగిరెగిరి పడుతున్నారు. అంత ఎగిరి పడొద్దండీ.. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరేం భయపడనక్కర్లా.. మీకు తగిన చోటు చూపించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది” అంటూ చంద్రబాబు ఘాటు కామెంట్స్ చేసారు. కేసులు పెడితే భయపడతారనుకుంటే, రౌడీయిజం చేస్తే భయపడతారనుకుంటే.. అది మీ వైసీపీ నేత‌ల మూర్ఖ‌త్వం అని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

Chandra Babu strong warning to cm ys jagan
Chandra Babu

ఓట్లను తారుమారు చేయొచ్చని అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదని చంద్రబాబు అన్నారు. దొంగ ఓట్లను చేర్చే వారికి చెబుతున్నా, ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలని, అన్నీ కంట్రోల్ చేస్తామన్నారు. తాను చెప్పే ప్రతీ మాటను ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి పంటలు మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలోనే ఉన్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయన్ని వెంటిలేటర్‌పైకి తీసుకొచ్చిందన్నారు. వనరులపై దోపిడీ.. అడిగిన ప్రతిపక్షాలపై దాడులే జగన్‌కు తెలుసునని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నాలుగేళ్లలో రైతులకు అప్పలు తప్ప ఈ ప్రభుత్వం ఒరగబెట్టిందని శూన్యం అని అన్నారు. దోపిడీ అనేది రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. అభివృద్ధి జరిగితే, ఇరిగేషన్ పెరిగితే, ఇండస్ట్రీలు వస్తే, రోడ్డు వేస్తే ఆ భూములు విలువ పెరుగుతుందన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago