Chandra Babu : ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం చాలా వాడివేడిగా సాగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటోన్నాయి. విమర్శల దాడులు తీవ్రతరం అయ్యాయి. వ్యక్తగత విమర్శలూ యథేచ్ఛగా దొర్లుతున్నాయి. వైసిపి అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారని పేర్కొన్న చంద్రబాబు చీకటి పాలనను అంతం చేసేందుకు, ఓట్లు చీలకూడదు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఎంతో విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ సహాయం అవసరమని అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. నాకు అనుభవం ఉందని పేర్కొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందని వ్యాఖ్యలు చేశారు. అగ్నికి వాయువు తోడైనట్లు ప్రజా గళానికి వారాహి తోడైందని చంద్రబాబు అన్నారు. అది జగన్ అహంకారాన్ని బూడిద చేస్తుందన్నారు.ఇక చిరంజీవి, రాజమౌళి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ జగన్పై నిప్పులు చెరిగారు చంద్రబాబు.2021లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రతినిధులు ఏపీ సీఎంతో సమావేశమైన సందర్భంలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించమని అభ్యర్థించడానికి జరిగిన సంఘటనను ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో చిరు, ప్రభాస్తో పాటు మరికొందరు తమ కార్లను కొంత దూరంలో పార్క్ చేసి మీటర్ల దూరం నడిచేలా చేశారు.
![Chandra Babu : చిరంజీవిని ఇంటికి పిలిచి అవమానిస్తావా.. ఆయనతో నీకు పోలికేంటంటూ చంద్రబాబు ఫైర్.. Chandra Babu strong counter to cm ys jagan about chiranjeevi](http://3.0.182.119/wp-content/uploads/2024/04/chandra-babu-1.jpg)
చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. రాజమౌళి పద్మభూషణ్ అందుకున్నారు. వారిని ఇంటికి పిలిచి అవమానిస్తారా. అసలు చిరంజీవితో జగన్ మోహన్ పోలిక ఉందా. మన ప్రభుత్వంలో ఏ నటుడిని అవమానించలేదు. జగన్ ఇంత మొండి వైఖరితో ప్రవర్తిస్తారా అంటూ పవన్ సమక్షంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.