Chandra Babu : ఎవరు ఊహించని విధంగా ఈ సారి ఏపీ ఎన్నికలలో కూటమి భారీ విజయం సాధించింది. ఈ పరిణామంతో వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఊహించనన్ని స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ నెంబర్ గేమ్లో పరుగులు పెడుతోంది. దీంతో చంద్రబాబు ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. నారా చంద్రబాబు భువనేశ్వరీ దంపతులు హర్షం వ్యక్తంచేస్తూ.. కేక్ కట్ చేశారు. అంతేకాకుండా.. నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ కూడా కేక్ ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కేక్ కట్ చేసిన చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్ అందరికీ తినిపించాడు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫొటోలు దిగారు.
వారిలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, యువనేత నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, తదితరులు ఉన్నారు. కాగా, కాసేపట్లో చంద్రబాబు నాయుడి ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన చర్చించనున్నాయి. కూటమి కట్టినప్పుడే సగం విజయం ఖాయమై పోయిందని అప్పుడే భావించాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పుడు వాళ్ల అంచనాలు అక్షరాలా నిజమవుతున్నాయి. కూటమి విజయకేతనం ఎగరవేస్తోంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ సత్తా చాటుతోంది టీడీపీ కూటమి.
చంద్రబాబు నాయుడిని బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సిద్ధార్థ్ సింగ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకి మరికొందరు నేతలు కూడా శుభాకాంక్షలు చెప్పారు.పవన్ పిఠాపురంలో స్పష్టమైన మెజార్టీ అందరీ దృష్టిని ఆకర్షించింది. మొదట్ రౌండ్ నుంచే ఆయన అదిక్యం చూపించారు. సమీప ప్రత్యర్థి వంగా గీత పై భారీ మెజార్టీతో గెలుపొందారు. గెలుపుతో పవన్ సతీమణి అన్నా లెజినోవా ఆయనకి వీరతిలకం దిద్దారు. ఆ సమయంలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే రాజధాని మార్పు వైసీపీకి గట్టిగా దెబ్బకొట్టినట్టు కనిపిస్తోంది. రాజధాని మారుస్తానని ప్రకటించడం తప్ప ఐదేళ్లుగా వైజాగ్కు చేసింది కూడా ఏమీ లేదు. ఇది టీడీపీ విజయానికి అనుకూలించిందనే టాక్ వినిపిస్తోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…