Chandra Babu : ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి ఓ రేంజ్లో ఉంది. మరి కొద్ది రోజులలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో నాయకులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మీద మరోసారి విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా సీఎం మీద ఆరోపణలు చేశారు. సచివాలయాన్ని తాకట్టుపెట్టి అప్పులు తేవడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇది ఏపీకి చాలా అవమానం అంటూ సీఎం జగన్ తీరు మీద విరుచుకుపడ్డారు. జగన్ తాకట్టుపెట్టింది భవనాలను కాదు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు.
‘రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను నాశనం చేశారు. అసమర్థ, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. 40 రోజుల్లోగా జగన్ ఇంటికి వెళ్తాడని చంద్రబాబు జోస్యం చెప్పారు. తాడేపల్లిగూడెం, ఇడుపులపాయ, కడప, హైదరాబాద్, బెంగళూరులో జగన్ ప్యాలెసులున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వైజాగ్ రుషికొండలో మరో ప్యాలెస్ నిర్మించుకున్నారని చెప్పారు. జనసేన, టీడీపీలో విభేదాలు సృష్టించలేరని స్పష్టం చేశారు. వైసీపీ అప్పులపాలు చేస్తే.. టీడీపీ ఆదాయం సృష్టించే పార్టీ అని చెప్పుకొచ్చారు.

మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేలా కార్యాచరణ ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. బెల్టు షాపులపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దశలవారీగా వాటిని తొలగించాలని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని అధికారులకు సూచించారు.రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వడ్డీలు కట్టేందుకు కూడా అప్పులు ఎందుకు చేస్తున్నామని అధికారులను నిలదీశారు.