Chandra Babu : నందమూరి తారకరత్న మరణంతో ఆయన కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన తిరిగిరాని లోకాలను వెళ్లడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తారకరత్న కుటుంబ సభ్యులు. తారకరత్న చితికి ఆయన తండ్రి మోహనకృష్ణ నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్న కర్మతో పాటు పెద్ద కర్మ కూడా ఆయన చేతుల మీదుగానే నిర్వహించారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కుప్పంలో హార్ట్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయకు షిఫ్ట్ చేశారు. అప్పటినుంచి చికిత్స కొనసాగింది. కానీ చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లారు తారకరత్న.
నారాయణ హృదయాలయకు విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం వచ్చి బెంగళూరులో తారకరత్నకు చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోమాలోకి వెళ్లిన తారకరత్నను కాపాడేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయమైన తారకరత్న తొలి సినిమాతో విజయం అందుకున్నారు. ఎన్టీఆర్కు మనవడు, ఛాయగ్రాకుడు నందమూరి మోహనకృష్ణకు తనయుడైన తారకరత్నను చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు కానీ పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. రాజకీయాలలో సత్తా చాటాలని అనుకున్న అతనిని మృత్యువు కబళించింది.
![Chandra Babu : చంద్రబాబు సభలో తారకరత్న భార్య ప్రత్యక్షం.. ఫొటో కోసం వస్తే అచ్చెన్నాయుడు ఏం చేశాడంటే..! Chandra Babu emotional about taraka ratna wife and daughter](http://3.0.182.119/wp-content/uploads/2024/01/chandra-babu.jpg)
అయితే తారకరత్న మరణించినప్పటి నుండి ఆయన జ్ఞాపకాలలోనే బ్రతకుతుంది అలేఖ్య. తాజాగా చంద్రబాబు నాయుడిని కలిసింది అలేఖ్య ఆయన కూతురు.కూతురు నిష్కతో కలిసి తాజాగా అలేఖ్య కలవగా, త్వరలో ఆమె టీడీపీలో చేరనుందని టాక్. చాలా రోజుల తర్వాత తారకరత్న భార్య, కూతురు కనిపించడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మీటింగ్లో అచ్చెన్నాయుడు కూడా కనిపించాడు.