Chandra Babu : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు మధ్యంతర బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుండి విడుదలైన తరవ్ఆత చంద్రబాబు నాయుడు హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం విడుదలైన చంద్రబాబు బుధవారం హైదరాబాదులోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను ఏఐజీ వైద్యుల బృందం కలిసి ఆరోగ్య పరిస్థితిపై పరీక్ష చేసింది. ఓసారి ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబుకు డాక్టర్లు సూచించారు. దీంతో ఉదయం ఆయన ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు… ఆయన ఆసుపత్రిలో చేరితే బాగుంటుందని తెలిపారు. వైద్యుల సూచనతో చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.
హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు ఏఐజీ వైద్యులు తొలుత ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ఆయనను ఆసుపత్రిలో చేరాలని సూచించారు. దాంతో ఆయన గురువారం సాయంత్రం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఇవాళ ఆయనకు మరికొన్ని పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. చంద్రబాబు కోసం టీడీపీ మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు వారందరికీ అభివాదం చేస్తూ కారెక్కి తన నివాసానికి వెళ్లిపోయారు.
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. నాదెండ్ల మనహోర్తో కలిసి నిన్న మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. జైలు నుంచి బెయిల్పై బయటికి వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికలకు తెదేపా – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించేందుకు ఇరు పార్టీల అధినేతలు నిర్ణయించినట్టు సమాచారం.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…