Byreddy Siddharth Reddy : ఏపీలో రోజు రోజుకి రాజకీయం వేడెక్కిపోతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో రాజకీయం మరింత రంజుగా మారింది. చంద్రబాబు ప్రస్తుతం వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యేక వీడియో విడుదల చేసి చంద్రబాబు, నారా లోకేష్లతో పాటు పవన్ కళ్యాణ్లకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఏనాడైన పోతిరెడ్డి పాడు వైపు చూశావా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్ని పర్యటనలు చేసినా ఆయనని పట్టించుకునే వారే లేరని.. అందుకే కాంట్రవర్సీ గా మాట్లాడుతున్నారని అన్నారు.
వాలంటీర్లు 5000 రూపాయల గౌరవ వేతనం తీసుకొని సేవలు చేస్తున్నారని.. వాళ్ల వల్ల డేటా చౌర్యం జరుగుతుందన్నడం సరికాదన్నారు.గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎవరు ప్రశ్నించలేదని అన్నారు. ఏపీలో కుళ్ళి కుషించిపోయిన టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీలో పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని ఎవరు అనుకోవడం లేదని ఆయన అన్నారు. ఇక లోకేష్ ముందు మంగళగిరి సంగతి చూసుకోవాలని సూచించారు. సీఎం జగన్ ఏపీలో పథకాలు ఎలా అమలు చేస్తున్నారో ప్రజలను అడిగి తెలుసుకోండని చురకలంటించారు.
![Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిపడేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్లలో ఏం చేశావు.. అంటూ వార్నింగ్.. Byreddy Siddharth Reddy strong reply to chandra babu](http://3.0.182.119/wp-content/uploads/2023/08/byreddy-siddharth-reddy.jpg)
అయితే వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పరోక్షంగా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. నందికొట్కూరు ఎమ్మెల్యేను కూడా లెక్క చేయని ఓ వైసీపీ నాయకుడు విర్ర వీగుతున్నాడని అన్నారు. రౌడీయిజం చేస్తే ఖబడ్దార్..మాటలు మాట్లాడటం కాదు, అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఇలా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ రాజకీయం మరింత రంజుగా మారేలా చేస్తున్నారు.