BJP : ఏపీలో పొత్తులు ఖాయమని చెబుతున్నా..అధికారికంగా ఖాయం కాలేదు. 2014 పొత్తులు రిపీట్ అవుతాయని పవన్ స్పష్టం చేసినప్పటికీ, ఇప్పటికీ దీనిపై బీజేపీ, టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు వైసీపీ పూర్తిగా ఎన్నికల కోసం గ్రౌండ్ లోకి వచ్చేసింది. అభ్యర్దులను దాదాపు ఖరారు చేసింది. ఈ రెండు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి. పొత్తు ఖాయం చేయాలంటే బీజేపీ కొత్త డిమాండ్లు తీసుకొస్తోంది. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చల తరువాత ఇక పాత్తులు ఖాయమని భావించారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమని అంచనా వేసారు. ఈ నెల 7న చంద్రబాబు – అమిత్ షా భేటీ జరిగింది. 15 రోజులు అయింది. ఇప్పటి వరకు ఈ పొత్తు పైన అటు బీజేపీ, ఇటు టీడీపీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కదలిక కనిపించటం లేదు. పవన్ మాత్రమే మూడు పార్టీల పొత్తు అంశం ప్రస్తావిస్తున్నారు.
బిజెపితో పొత్తు అంశంపై చంద్రబాబు అంత ఆశాజనకంగా మాట్లాడలేదు. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన పొత్తు ఖరారైందని, పవన్ కల్యాణ్ చెప్పినట్లు బిజెపి కలిసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తామని, అంటున్నారు. టీడీపీలో కొందరు సీనియర్లు బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేరు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం ఏపీలో జగన్ ను ఓడించాలంటే అవసరమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీని కోసం బీజేపీ ముఖ్యులతో మంతనాలు చేసారు. సీట్ల పంపకాల గురించే ప్రధానంగా బీజేపీ నుంచి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ 8-10 ఎంపీ స్థానాలు, 15-20 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తోంది.
టీడీపీ నుంచి 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం చెప్పారు. ఈ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించటం లేదు. జనసేన కు 3 ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తుండటంతో..బీజేపీకి ఇంతకు మించి అవకాశం లేదనేది టీడీపీ ముఖ్యుల వాదన. బీజేపీ మాత్రం తమ లక్ష్యం 400 ఎంపీ సీట్లుగా చెబుతూ..ఏపీలో తమకు 10 స్థానాలు కావాలని పట్టు బడుతోంది. 8 స్థానాల కంటే తాము తక్కువగా అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు.. భాజాపాని పరీక్షంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే..మేము స్వేచ్చాజీవులం. పొత్తు అధిష్టానం చెబితే చేస్తామని ఏపీ బీజేపీ నాయకులు అంటున్నారు. అధిష్టానం కూడా ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వడం లేదు. అయితే బాబు లేకపోయిన మేము పోటికి వెళతాం అని బీజేపీ పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నట్టు అర్ధమవుతుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…