Balakrishna : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఇటీవల సినీ ప్రముఖులు కలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున దంపతులు.. ఇలా ప్రముఖులు అందరూ సీఎం రేవంత్ ను కలిసి విషెష్ చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సైతం వెంటనే వైరల్ అవుతున్నాయి. తాజాగా నటసింహం నందమూరి బాలయ్య.. రేవంత్ రెడ్డిని కలిశారు. బాలయ్య తన అల్లుడితో కలిసి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యి 20 రోజులు దాటినా.. ఆయనకు సినీ ప్రముఖుల నుంచి విషెష్ అందుతున్నాయి. ఇక ఆయనకు ముఖ్యమంత్రిగా ఎన్నిక అయినందుకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిసి విషెష్ చెబుతున్నారు.
నాగార్జున, అమల దంపతులు సీఎం ని కలిసి ఆయన అభినందనలు తెలియచేయగా కొద్దిసేపటి క్రితం తన అల్లుడు భరత్ తో కలిసి నటసింహం నందమూరి బాలకృష్ణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి ఆయనకు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేసారు. ఆ సందర్భంగా వారు దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణతోపాటు ఆయన అల్లుడు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు కూడా హాజరు అయ్యారు. ఇక ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి కొన్నాళ్లపాటు సేవలు అందించారు కూడా. ఆ సమయంలో బాలకృష్ణతో రేవంత్రెడ్డికి మంచి అనుబంధం ఉండగా… ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు కలవడం చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం మారినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిని, సీఎంని కలవడం సహజమే. అందులో భాగమే ఇదంతా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని బాలయ్య మీట్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా బాలయ్య విషయానికి వస్తే… ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తుండగా, ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…