Venu Swamy : వేణు స్వామీ.. ఏమిటీ ర‌చ్చ స్వామీ..?

Venu Swamy : రాజకీయ విశ్లేషణలు, సినీ సెలబ్రిటీల జోత్యిష్యం చెబుతూ వార్త‌ల‌లో నిలిచే వేణు స్వామి ఆ మ‌ధ్య మ‌ళ్లీ ఎవ‌రి జోలికి రాన‌ని చెప్పాడు. కాని ఆ మాట‌ల‌ని ప‌క్క‌న పెట్టేశాడు. అక్కినేని నాగచైతన్య ,శోభిత ధూళిపాళ్ల పెళ్లయిన కొన్నాళ్లకు విడిపోతారని ఇద్దరి గ్రహ మైత్రి సరిలేదని, నిశ్చితార్థం జరిగిన సమయం కూడా అనుకూలంగా లేదని, ఈ కారణాలతో వారు విడిపోతారని జోస్యం చెప్పారు. సమంతతో విడిపోయినట్లే, శోభితతో కూడా చైతన్య విడిపోతాడని ఆయన సెలవవ్వడంతో అభిమానులు, నెటిజన్లు వేణుస్వామిని ట్రోల్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా మాట యుద్దాలు చేశారు. ఇదే విషయంపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన అధ్యక్షుడు మంచు విష్ణు కూడా వేణుతో ఫోనులో మాట్లాడటంతో ఆయన ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

“రెండు నెలల క్రితమే రాజకీయ విశ్లేషణలు, సినీ సెలబ్రిటీల జాతాకలు చెప్పనని చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉంటాను. అయితే నాగచైతన్య, శోభిత జాతకం గురించి చెప్పడానికి కారణం ఉంది. గతంలో సమంత, చైతన్య గురించి చెప్పాను, దానికి కొనసాగింపు అన్నట్లు ఇది చెప్పాను. ఇదే విషయంపై మంచు విష్ణు ఫోన్లో మాట్లాడారు. ఇకపై సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెప్పనని, సంబంధిత వీడియోలో పోస్ట్‌ చేయనని చెప్పాను. ఆయన కూడా పాజిటవ్‌గా తీసుకున్నారు. ఇకపై నా నుంచి సెలబ్రిటీల జ్యోతిష్యాలు ఆశించవద్దు’ అని వీడియోలో పేర్కొన్నారు. క‌ట్ చేస్తే గత కొన్నాళ్లుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామిల మధ్య వివాదం నడుస్తోంది. జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ.. టీవీ 5 డిబేట్‌లతో స్వామి వారి యవ్వారాలన్నింటికీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి.

astrologer venu swamy facing real problems now
Venu Swamy

అయితే జర్నలిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాంట్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణు స్వామి దంపతులు. ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు వేణుస్వామి. నన్ను జర్నలిస్ట్ మూర్తి 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి నాపై దాడి చేయడం ప్రారంభించారు. నన్ను నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. వాళ్లు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు. గత ఎనిమిది నెలల నుంచి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో నాపై దాడులు ప్రారంభించారు. నేను నా భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని అన్నారు.దీనిపై మూర్తి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఆయ‌న‌పై పోలీస్ స్టేష‌న్‌లో కూడా కేసు న‌మోదు చేశారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ర‌చ్చ‌గా మార‌డంతో అంద‌రు వేణు స్వామినే తిట్టిపోస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

13 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

20 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago