Aratikaya Podi Kura : మనకు అందుబాటులో ఉన్న పలు రకాల కూరగాయల్లో కూర అరటి కాయలు ఒకటి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని ఉపయోగించి సరైన రీతిలో కూర చేయాలేకానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే కూర అరటికాయలతో మనం పొడి కూరను కూడా తయారు చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కూర అరటికాయ పొడి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
కూర అరటికాయలు – 3, ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీస్పూన్, ఉప్పు – తగినంత, మసాలా ముద్ద కోసం – కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు, చింత పండు – చిన్న నిమ్మకాయంత, బెల్లం తురుము – ఒక టీస్పూన్, మసాలా పొడి కోసం – మినప పప్పు – 2 టీస్పూన్లు, ఎండు మిర్చి – 8, ధనియాలు – 2 టీస్పూన్లు, సోంపు – 1 టీస్పూన్, తాళింపు కోసం – ఆవాలు – ముప్పావు టీస్పూన్, కరివేపాకు రెబ్బలు – 4, నూనె – తగినంత.
కూర అరటికాయ పొడి కూర తయారు చేసే విధానం..
మసాలా పొడి కోసం తీసుకున్నవన్నీ వేయించి పక్కన పెట్టాలి. చల్లారాక పొడి చేయాలి. మసాలా ముద్ద కోసం తీసుకున్న కొబ్బరిని కొద్దిగా వేయించాలి. గోధుమ రంగులోకి మారాక పక్కన ఉంచాలి. ఇప్పుడు దీనికి చింత పండు, బెల్లం తురుము, తగినంత ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి. అందులోనే మసాలా పొడి కూడా కలిపి ఉంచాలి.
ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కోయాలి. అరటి కాయల్ని ఉడికించి తొక్కు తీసి ముక్కలు ముక్కలుగా పొడి పొడిగా ఉండేలా చిదమాలి. బాణలిలో నూనె వేసి తాళింపు దినుసులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలు, మసాలా ముద్ద వేసి సిమ్లో పొడి పొడిగా అయ్యే వరకు వేయించి తీయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే అరటికాయ పొడి కూర తయారవుతుంది. దీన్ని అన్నంతో వేరే ఏదైనా కూరతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అరటి కాయ అంటే ఇష్టం లేని వారు కూడా వాటిని ఇలా వండితే ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా కూడా ఉంటుంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…