Anchor Suma : తెలుగు రాష్ట్రాలలో యాంకర్ సుమ గురించి తెలియని వారు లేరు. మలయాళీ అయినప్పటికీ చలాకైన మాటలతో గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు. సుమ తెలుగులో పాపులర్ యాంకరే కాదు.. టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్లు అయిన ఆమె హోస్ట్ చేసి తీరాల్సిందే. . తెలుగు ఇండస్ట్రీలోని టాప్ యాంకర్లలో ఒకరిగా పేరుపొందిన ఈ 47 ఏళ్ల స్టార్ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే ఎప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడే సుమ తాజాగా జరిగిన ఈవెంట్లో మాత్రం నోరు జారి విమరక్శల పాలైంది.
ఇంతకు సుమ చేసిన తప్పేంటంటే..ఆదికేశవ సినిమాలో మూడో పాట అయిన లీలమ్మో పాట లాంచ్ ఈవెంట్ బుధవారం (అక్టోబర్ 25) హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సుమ హోస్ట్ చేయగా, ఆ రోజు తాము పెట్టిన స్నాక్స్ను ఎవరైతే భోజనంలా తింటున్నారో వాళ్లు తొందరగా లోపలికి వచ్చిన ఇక్కడ కెమెరాలను పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామని జర్నలిస్టులను ఉద్దేశించి సుమ అన్నారు. దీనిపై ఓ జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వాళ్ల విషయంలో సుమ లిమిట్స్లో ఉండాలని అన్నారు. సుమ చేసిన వ్యాఖ్యలు తమకు కోపం తెప్పించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఈవెంట్లో స్టార్ట్ చేసే ముందు.. స్నాక్స్ భోజనంలా చేస్తున్నారని మీరు మీడియా వాళ్లను అన్నారు చూశారా.. అది ఒకటి అనకుండా ఉండి ఉంటే బాగుండేది” అని ఆ జర్నలిస్టు అన్నారు.దీనికి సుమ క్షమాపణలు కోరింది.. ‘మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను ఓ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నాను. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా అని ఆ వీడియోలో తెలిపారు. అయితే సుమని కొందరు నెటిజన్స్ ట్రోల్ కూడా చేస్తున్నారు. మీడియా విషయంలో హద్దులు దాటొద్దంటూ చురకలు అంటిస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…