Anam Venkata Ramana Reddy : ఏపీ రాజ‌కీయాల్లో ష‌ర్మిళ దూకుడుపై ఆనం సంచ‌ల‌న కామెంట్స్..!

Anam Venkata Ramana Reddy : ఏపీ రాజ‌కీయాలు రోజురోజుకి హీటెక్కిపోతున్నాయి.ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. సాక్షి మీడియా గురించి పదే పదే ఎందుకు అబద్ధాలు చెబుతావని ప్రశ్నించారు. 2006లో రూ.లక్షతో ప్రారంభించిన సాక్షి మీడియా ఇప్పుడు వేల కోట్ల లాభం ఎలా పొందగలిగిందని నిలదీశారు. ఆ చిట్కా ఏదో ఇతరులకు చెబితే బాగుంటుందని సూచించారు. సాక్షి మీడియాలో తనకు సగం వాటా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆ క్రమంలో ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు.

సాక్షి మీడియా తనది కాదని సీఎం జగన్ అప్పుడప్పుడు అంటుంటారు. ‘సాక్షి ఎవరిదీ..? నీదు కాదు, నీ భార్య భారతికి సంబంధం లేదు, నీ కూతుళ్లకు వాటా లేదు. నీ బావ మరిది దినేశ్ రెడ్డికి చెందింది కాదు.. ఇంతకి సాక్షి మీడియా ఎవరిదీ..? అని’ అనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికను 2006లో ప్రారంభించారని ఆనం వెంకట రమణారెడ్డి గుర్తుచేశారు. రూ.లక్షతో ప్రారంభించామని చెబుతారు. విజయసాయిరెడ్డి రూ.30 వేలు, జగన్ రూ.30 వేలు, కామత్ రూ.35 వేలు పెట్టుబడి పెట్టారని వివరించారు. 2007 వరకు సాక్షి డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి ఉన్నారు. తర్వాత జగన్, ఆయన తర్వాత వైఎస్ భారతి డైరెక్టర్లుగా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి 2015వరకు డైరెక్టర్‌గా ఉన్నారని వివరించారు. రూ.లక్ష పెట్టుబడితో మొదలైన సాక్షి సంస్థ ఇప్పుడు వేల కోట్లకు పడగలేత్తిందని విమర్శించారు.

Anam Venkata Ramana Reddy sensational comments on ys sharmila
Anam Venkata Ramana Reddy

ఇక ఇదిలా ఉంటే సీఎం జగన్ పై షర్మిల చేస్తున్న విమర్శలు జనంలోకి వెళ్తున్నాయని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.ఈసారి ఎన్నికల్లో షర్మిల ప్రభావం కనిపించకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం బలపడుతుందని తెలిపారు.ఐదేళ్లపాటు షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా ఉంచితే కాంగ్రెస్ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే 2029లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, హస్తం గుర్తు, ఇందిరమ్మను ప్రజలు పూర్తిగా మరిచి పోలేదని చెప్పారు.అలాగే తమపై అనర్హత వేటు వేసే అంశంలో స్పీకర్ కు సజ్జల ఫోన్ చేసి డైరెక్షన్ ఇస్తున్నారని ఆరోపించారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago