Anam Venkata Ramana Reddy : ఏపీ మద్యంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఏపీ మద్యంపై చిర్రుబుర్రులాడారు. ఇక తాజాగా ఆనం వెంకటరమణా రెడ్డి కూడా ఏపీ మద్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్లో ఎదురుగా పలు రకాల ఏపీ బ్రాండ్స్ పెట్టుకొని ఒక్కొక్క దాని గురించి, ఆ బ్రాండ్ నేమ్ గురించి చెబుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఆనం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధ చట్టాన్ని తీసుకొస్తాం. దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తాం’ అని విపక్షనేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ ఏమి చేశారు.
మహిళలకి హామీల మీద హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఏం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ మద్యం నిషేధం కాలేదు, జగన్ ఇచ్చిన హామీలు నేరవేరలేదు. ఈ నాలుగేళ్ల పాలనలో జగన్ ఏం చేశారు..? ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో మద్యం ఆదాయం లెక్కలు దేనికి సంకేతం..? మాట తప్పేది లేదు.. మడం తిప్పేది లేదు అన్న జగన్ మోహన్ రెడ్డి.. నాటి మాటలకు-నేటి చేతలకు పొంతన ఎక్కడ..?. అని ఆయన ప్రశ్నించారు.అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో కచ్చితంగా ఊర్లలో మద్యం షాపే లేకుండా చేస్తామని హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు.
![Anam Venkata Ramana Reddy : ఏపీ లిక్కర్పై ఆనం అదిరిపోయే పంచ్లు.. వైసీపీ నాయకుల రియాక్షన్..? Anam Venkata Ramana Reddy funny comments on ap mandu brands](http://3.0.182.119/wp-content/uploads/2023/07/anam-venkata-ramana-reddy-1.jpg)
వెయ్యి మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలో పది మంది మహిళా పోలీసుల్ని పెట్టి.. సారాయి, బెల్టుషాపు నిరోధిస్తామన్నారు, నిరోధించారా..?, తాగుడు అనేది లేకుండా పోయిన రోజే ప్రతి కుటుంబంలో.. ప్రేమ, అప్యాయతలు వెల్లివిరిసేదని నాడు ఎంతో ఆవేదన చెందిన జగన్.. 4వ ఏడాదీలోకి అడుగుపెట్టబోతున్నాకూడా ప్రతి కుటుంబంలో ప్రేమ, అప్యాయతలు పూయించలేకపోతున్నారు.. మద్యపాన నిషేధం తీసుకుని రాకపోతే అయిదేళ్ల తర్వాత ఓట్లు అడగబోమని ప్రతిపక్ష నేతగా అన్న జగన్.. మద్యంపై ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రతి బ్రాండ్పై ఉన్న పేర్లు చదువుతూ వాటి గురించి చెబుతూ విరుచుకు పడ్డారు ఆనం.