Ambati Rambabu : ప్రస్తుతం ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ-జనసేన అన్నట్టు వార్ నడుస్తుంది. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ తెగ రచ్చ చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి అని అపశకునలే ఎదురయ్యాయని ఆరోపించారు. కుప్పంలో యాత్ర మొదలు పెట్టగానే నందమూరి తారకరత్న మృతి చెందారని పేర్కొన్నారు. అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో వారికే అర్ధం కావడం లేదని విమర్శించారు. కనీసం పాదయాత్ర సభలో ఏం మాట్లాడాలో తెలియడం లేదని అన్నారు. కొడుకు కోసం చంద్రబాబు, అల్లుడు కోసం బాలకృష్ణ నానా తంటాలు పడుతూ పనన్ కల్యాణ్ సహకారం తీసుకుంటున్కారని ఆరోపించారు.
ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్ పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా కొందరు అధికారులు, పోలీసుల పేర్లను నారా లోకేశ్ ఓ ఎర్ర పుస్తకంలో రాసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. “ఎర్ర బుక్ అంట. అందులో పేర్లు రాసుకున్నాడంట. ఆ బుక్ ఒరిజినల్ కాపీని వాళ్ల నాన్న గారికి ఇస్తాడంట… ఒక కాపీ తన వద్ద ఉంచుకుంటాడంట. ఇంకో కాపీ ఆ యాంకర్ కు కూడా ఇవ్వవయ్యా! పవన్ కల్యాణ్ యాంకర్ గా వస్తున్నాడు కదా… ఆయనకు కూడా ఇస్తే బాగుంటుంది! ఆయన కూడా నీ భాగస్వామే అన్నావుగా.
నీ దుంపతెగ… తెలుగుదేశం పార్టీ తెల్లజెండా ఎత్తేంత వరకు మన లోకేశ్ బాబు నిద్రపోయేట్టు లేడు! తెల్లజెండా ఎత్తిన తర్వాతే ఆయన నిద్రపోతాడు! నేను ఎప్పుడో చెప్పాను… లోకేశ్ బాబు ఒక ఐరన్ లెగ్. అతడు కాలు పెట్టాడు… తెలుగుదేశం కుంగింది… యువగళం పాదయాత్ర చేశాడు… తెలుగుదేశం ఇంకా కుంగింది” అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, చంద్రబాబు భలే యాంకర్లను సెట్ చేశాడంటూ అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…