దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపొందింది.ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాలు అన్నీ ఇన్నీ కావు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు…’ పాటకు గోల్డెన్ గ్లోబ్ సలాం కొట్టింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుని మన సినిమా సత్తా చాటింది. అవార్డు ప్రకటించిన తర్వాత రాజమౌళి రియాక్షన్ మాములుగా లేదు. ఈ అవార్డు ప్రకటించిన వెంటనే ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అక్కడే ఉన్న ట్రిపుల్ ఆర్ టీం దీన్ని చూసి ఎంజాయ్ చేసింది.
అవార్డు రావడంపై ప్రముఖులు ట్రిపుల్ ఆర్ మూవీ టీంకు అభినందనలు చెబుతున్నారు. నాటు నాటు సాంగ్తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలానే ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసింది” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అలానే పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. సామాన్య పౌరుడి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరకు అందరూ గర్వపడుతూ ట్వీట్లు చేయడం విశేషం.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ఆర చిత్ర బృందానికి అల్లు శిరీష్ కూడా తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. ‘‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు. తెలుగు సినిమా పరిశ్రమ, భారతీయ సినిమా గర్వపడే క్షణమిది’’ అని అల్లు శిరీష్ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే, ఈ ట్వీట్లో రామ్ చరణ్, ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి,ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ హ్యాండిల్స్ను అల్లు శిరీష్ ట్యాగ్ చేశారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ను మాత్రం ట్యాగ్ చేయకుండా #NTRJr అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు.అయితే ఇది జూనియర్ అభిమానులకి కోపం తెప్పించింది. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ఆయనని ట్రోల్స్ చేస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…