త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరియు పూజ హెగ్డే కలిసి నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డాన్స్ పెర్ఫార్మెన్స్ గానీ, డైలాగ్ డెలివరీ కానీ అందరినీ ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి గాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ సమస్థ నిర్మాణ సారథ్యం వహించారు. తమన్ సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అని చెప్పవచ్చు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ చిత్రంలో అందరినీ బాగా ఆకట్టుకున్న మరో అంశం ఏమిటంటే..?
ఈ చిత్రంలో కనిపించే ఇల్లు. సినిమాలో ఈ భారీ ఇంటిలో టబు ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ అసలైన తల్లిదండ్రులు ఉంటారు. సినిమా ప్రారంభంలోనే అల్లు అర్జున్ ఈ ఇంటిలో అడుగుపెడతాడు. అప్పుడు ఇంటి గేట్ ను చూపిస్తారు. ఆ తరవాత ఇంట్లో చాలా సన్నివేశాలు చిత్రీకరించారు . అంతేకాకుండా ఈ ఇంటిలో తీసిన సీన్స్ అని ఎంతో అందంగా కనిపించాయి.
థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులను ఈ ఇల్లు బాగా ఆకట్టుకుంది. ఇంద్రభవనంలా కనిపించే ఆ ఇంటిని చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంటి ముందు భారీ గేట్, ఇంట్లో ఫర్నిచర్, చుట్టూ చెట్లు, విశాలమైన ఇంటి ముందు స్థలం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అల్లు అర్జున్ కు సైతం ఇల్లు చాలా చాలా నచ్చేసిందట. అంతేకాకుండా తాను కూడా అలాంటి ఇంటిని కట్టుకోవాలని బన్నీ ఎప్పటినుంచో అనుకున్నాడట. మరీ ఆ అందమైన ఇల్లు మరెవరిదో కాదు. ఎన్టీవీ ఛైర్మెన్ నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి భర్తది. ఆ ఇంటి నిర్మాణం కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేసారట.
ఈ సినిమా బ్యానర్ నిర్మాత అయిన రాధాకృష్ణకు ఇంటి యజమానులు బంధువులు అవుతారు. అయితే సినిమా ఆర్ట్ డైరెక్టర్ భారీ ఇంటి సెట్స్ నిర్మించాలని చెప్పడంతో రాధాకృష్ణ ఆ ఇల్లు చూపించి అదే ఇంటిని ఫైనల్ చేశారట. ఇక ఈ ఇంటికి బయట ఉండే కొన్ని సీన్స్ కోసం 5 కోట్లతో అన్నపూర్ణ స్టడియోలో సెట్స్ వేసి తీసినట్టు తెలుస్తోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…