Adisheshagiri Rao : న‌రేష్‌కు, మాకు సంబంధం ఏమీ లేదు.. కృష్ణ సోద‌రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Adisheshagiri Rao : గ‌త కొద్ది రోజులుగా న‌రేష్ తెగ హంగామా చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పవిత్ర లోకేష్‌తో ఆయన చేస్తున్న హంగామా చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చర్య‌పోతున్నారు. మ‌ళ్లీ పెళ్లి సినిమా ప్రమోష‌న్ లో భాగంగా న‌రేష్ మాట్లాడుతూ.. త‌మ రిలేష‌న్ షిప్‌ని, కృష్ణ‌, మ‌హేష్ బాబు ఒప్పుకున్న‌ట్టు కూడా కామెంట్స్ చేసారు. ఈ క్ర‌మంలో కృష్ణ సోద‌రుడు ఆదిశేషగిరిరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కృష్ణ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అన్నయ్య వెంటే ఉండి ఆయనతో సినిమాలు చేసిన అత‌ను ఇప్పుడు మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నట్టు ఆదిశేషగిరిరావు వెల్లడించారు.

ఇక ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో మాట్లాడిన ఆయన సీనియర్ నటుడు నరేష్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ ఎవరో తనకు తెలీదని అన్నారు. ఆయన గొడవల గురించి తాను మాట్లాడనని.. తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. నరేష్ భార్య రమ్య ఇటీవల కృష్ణ చివరి రోజుల్లో ఆయనను ఒంటరిగా వదిలేశారని, కృష్ణ‌ను అనాథలా ఇంట్లోనే వదిలేశారంటూ చేసిన ఆరోపణలపై ఆదిశేషగిరిరావు బదులిస్తూ.. ‘‘అదంతా అబద్ధం అని అన్నారు. ఆరోజు రాత్రి మొత్తం మా అబ్బాయి అక్కడే ఉన్నాడు. అతనితోపాటు మా మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే మహేష్ బాబు లేకపోతే ఎవరూ లేనట్టేనా దాని అర్థం అని అన్నారు.

Adisheshagiri Rao sensational comments on naresh
Adisheshagiri Rao

సూపర్ స్టార్ కృష్ణ మృతిచెందిన రోజు ఆయన పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంకు ఎందుకు తీసుకెళ్లలేదని ప్ర‌శ్నించ‌గా, గచ్చిబౌలి స్టేడియంలో అప్పుడు మంచు ఎక్కువగా పడుతుండటం.. ఆ మంచులో బయట కృష్ణ పార్థివదేహాన్ని ఉంచడం ఇష్టం లేక తీసుకెళ్లలేదని ఆదిశేషగిరిరావు చెప్పుకొచ్చారు. కాగా, మే 31న మోస‌గాళ్లకు మోస‌గాడు చిత్రం విడుద‌ల కానుండ‌గా, దీని కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియాలోనే మొదటి కౌబాయ్ మూవీగా రూపొందిన ఈ సినిమా 1971లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. సుమారు 52 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ అవ్వబోతుంది.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

24 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago