ఫ్యాన్స్ ఆగ్ర‌హం ఎఫెక్ట్‌.. ఆదిపురుష్ గ్రాఫిక్స్‌లో భారీ మార్పులు.. మ‌ళ్లీ ఎన్ని వంద‌ల కోట్లు ఖ‌ర్చంటే..?

డార్లింగ్ ప్ర‌భాస్‌కి ఈ ఏడాది పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న న‌టించిన రాధే శ్యామ్ ఇదే ఏడాది విడుద‌ల కాగా,ఈ చిత్రం దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. మరోవైపు తన ప్రాణానికి ప్రాణమైన పెదనాన్న కృష్ణంరాజు క‌న్నుమూసారు. ఆ బాధ నుండి ఇప్ప‌టికీ బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. మ‌రోవైపు ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలు వాయిదాలు ప‌డ‌డం. రామయణం ఆధారంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ చిత్రాన్ని వచ్చే యేడాది జనవరి 12 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాని ఈ మూవీ వాయిదా ప‌డ‌నుంద‌ని తెలుస్తుంది. మ‌రో వైపు ప్ర‌భాస్ స‌లార్ చిత్రం కూడా చెప్పిన టైంకి రాలేక‌పోవ‌చ్చ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం ఆదిపురుష్ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇందులోని స‌న్నివేశాలు నాసిక‌రంగా ఉన్నాయి. చిన్న పిల్ల‌ల గేమ్‌లా అని చాలా మంది పెద‌వి విరిచారు. తెలుగు వెర్షన్ తీసుకోవాలనుకున్న యువి సంస్థ కూడా ఆందోళనకు గురయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా సిజి వర్క్ విషయంలో దర్శకుడు ఓం రౌత్ కు గట్టి క్లాస్ పీకినట్లు బోగట్టా. ఆ విషయంలో తనదీ భరోసా అని దర్శకుడు ప్రభాస్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిజి వర్క్ లు పూర్తిగా చూసి, సంతృప్తి చెందిన తరువాతే విడుదలకు వెళ్తారని ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి.

adipurush low quality graphics team to spend rs 100 crores again

వీఎఫ్‌ఎక్స్ వర్క్ మ‌ళ్లీ చేయడానికి మేకర్స్ భారీ రూ. 100 కోట్లు వెచ్చిస్తున్నట్లు కూడా సమాచారం. రామ్ (ప్రభాస్), రావణ (సైఫ్) నటించిన కొంత భాగాన్ని రీషూట్ చేస్తారని కూడా వినిపిస్తోంది. మరికొన్ని క్యారెక్టర్ లుక్స్ డిజిటల్ రీక్రియేట్ కూడా చేయోచ్చ‌ట‌. ప్రస్తుతానికి ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి ఎన్నో ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌క అభిమానులు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. జనవరి 12న బడా హీరోల చిత్రాలతో పాటు.. ఒకేసారి అనేక సినిమాలు విడుదలవుతున్న క్రమంలో ఆదిపురుష్ చిత్రాన్ని వాయిదా వేయాలని భావిస్తున్నారట మేకర్స్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

21 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago